జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన ప్రదేశం భీమ్ కుండ్. జానపద గాధల ప్రకారం, మహాభారత కాలంలో పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ నివసి౦చారని చెప్తారు. ఇక్కడ మొదలయ్యే ఒక సొరంగం ఎంతో దూరంలో ఉన్న ఘోతియా అంబా అనే ప్రాంతంలో ముగుస్తుందని చెప్తారు. వర్షాకాలంలో పాండవులు ఈ సొరంగాన్ని వాడేవారని ప్రజలు చెప్తారు.