బన్స్వారా జిల్లా కేంద్ర౦ నుంచి త్రిపుర సుందరి దేవాలయం 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్తియ మాతగా పిలువబడే త్రిపుర సుందరి దేవి కోసం ఈ ఆలయం నిర్మించారు. నల్లరాతి నుంచి చెక్కిన దేవి విగ్రహం ఈ గుడిలో ఉంది. జానపద గాధల ప్రకారం, కుషాణుడు అనే నియంత పాలనకన్నా ముందే ఈ దేవాలయం నిర్మించబడింది. శక్తిపీఠంగా ప్రసిద్ధమైన ఈ దేవాలయాన్ని అమ్మవారి భక్తులు పవిత్రంగా పరిగణిస్తారు.