బారాబంకి జిల్లాలో సాత్రిఖ్ ఒక చారిత్రాత్మక టవున్. ఇక్కడ రాజ గురువు వుండి , రాజ కుమారులకు చదువు చెప్పేవాడు. ఇది ఒక గొప్ప తపోస్థలం. అనేక మంది ఋషులు, మునులు ఇక్కడ వుండేవారు. సాత్రిఖ్ లో సాలార్ షా యొక్క తండ్రి సమాధి కూడా నిర్మించారు. ఇది ఒక పర్యాటక ఆకర్షణ.