జీలం నది ఒడ్డున, శ్రీనగర్ కి 48 కిలోమీటర్ల దూరంలో గల సోపూర్ క్రీ.శ. 880 కాలం లో రాజా వంతివర్మన్ చే నిర్మించబడినది. సోపూర్ ఉత్తర కాశ్మీరులో కెల్ల పెద్దదైన వ్యాపార కేంద్రము. ఇది "యాపిల్ టవున్ ఆఫ్ ఆసియా" గా సందర్శకులలో ప్రసిద్ధి. సోపూర్ యాపిల్ పళ్ళు ఆసియా ఖండం లో లభించే యాపిల్ పళ్ళు అన్నింటి కెల్లా నాణ్యమైనవి. ఇక్కడ వేగంగా వ్రుద్ధి చెందుతున్న వ్యవసాయ హరిత వనాల వల్ల కాశ్మీరు వాసులలో సోపూర్ "లండన్ ఆఫ్ కాశ్మీరు" గా ప్రసిద్ధి.
సోపూర్ పట్టణం "జామియా మశీదు","ఖాన్-కా-షా-ఇ-హందన్" మరియు ఇతర మత పరమైన ఆలయాలకి ప్రసిద్ధి. "షైక్ హంజ మఖ్దూమి తుజర్","అర్జ సాహిబ్ టక్య ఖాన్ జైనగిర్","దైద్ మౌజ్ ముండ్జీ","బాబా షుకుర్ దిన్ వత్లాబ్ సోపూర్","హాతీ షా సాహిబ్" దేవాలయాలు సోపూర్ లో గల అసంఖ్యాక ముస్లిం మందిరాలలో కొన్ని. ఇక్కడే హిందూ దేవాలయాలైన కాళీ మందిర్, శివ మందిర్,బత్పూరా లో గల రిషి పీర్ మందిర్, భైరవ్ మందిర్ లు కూడా ఉన్నాయి.