భంద్ దేవరా ఆలయం రామ్ ఘర్ కోటపై బరన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది, ఇది ‘రాజస్తాన్ ఖజురహో’ గా ప్రసిద్ది చెందింది. చెరువు ఒడ్డున ఉన్న ఈ మందిరాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు. ప్రస్తుతం ఇది నవీకరణ పనులకోసం పురావస్తు శాఖ అధీనంలో ఉంది.
కిస్నై, అన్నపూర్ణ దేవి ఆలయాలు కూడా రామ్ఘర్ కొండపై ఉన్నాయి. ఈ విగ్రహాలు సహజమైన గుహలోపల ఉన్నాయి, ప్రయాణీకులు ఝాలాజాలిం సింగ్ చే నిర్మించబడిన షుమారు 750 మెట్లు ఎక్కి ఇక్కడకు చేరతారు. ఈ ఆలయంలోని దేవతలలో ఒకరిని మేవ లేదా డ్రై ఫ్రూట్స్ తో పూజిస్తారు, మిగిలినవారికి మాంసం, మద్యం అందిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు జరిగే గొప్ప ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.