కకొని, బరన్ జిల్లాలోని చిపబరోడ్ తెహసిల్ లో షుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. పార్వన్ నది ఒడ్డున ఉన్న ఈ స్థలం దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడి జైన, శివ, వైష్ణవ మందిరాలు 8 వ శతాబ్దానికి చెందినవి. కకొని దేవాలయాలలోని 60 శాతం కంటే ఎక్కువ విగ్రహాలు కోట, ఝలావర్ మ్యూసియం లలో భద్రపరచబడినాయి. యాత్రికులు భీందేవ్ మహారాజుచే నిర్మించబడిన భిమ్గర్ కోటను కూడా ఇక్కడ చూడగలరు.