కిరదు పురాతన దేవాలయాలు మొత్తంగా అయిదు దేవాలయాలు. ఇవి బార్మర్ పట్టణానికి సుమారు 39 కి.మీ. ల దూరంలో హత్మా గ్రామంలో కలవు. ఇక్కడకల శిలా శాసనాలు బట్టి క్రీ. శ. 1161 కి చెందిన ఈ పట్టణం ఒకప్పుడు కిరాత్ కూప అని పిలువబడి పన్వారా వంశానికి రాజధానిగా ఉండేది.
అయిదు దేవాలయాలలోను సోమేశ్వర దేవాలయం అతి పెద్దది. ఈ దేవాలయం శివ భగవానుడి విగ్రహంతో 11వ శతాబ్దంలో నిర్మించారు. బహుళ అంతస్తుల గోపురం, వివిధ హిందూ దేవతలు, దేవుళ్ళను ఈ దేవాలయంలో చూడవచ్చు. దేవాలయం లోపలి భాగాలలో దేవుడి విగ్రహాలు ఉండగా గుడి కిందిభాగం చక్కగా చెక్కబడిన పద్మాన్ని కలిగి ఉంటుంది.
ఇక్కడ కల ఇతర నాలుగు దేవాలయాలు విష్ణు మరియు శివుడికి చెందినవి. రామాయణం నుండి వివిధ ఘట్టాలను దేవాలయ గోడలపై అందంగా చెక్కారు.