మహు డాబర్ గా పిలువా బడే ఈ చిన్న పట్టణం బస్తి కి 15 కి.మీ.ల దూరంలో కలదు. ఈ గ్రామం స్వంత్ర పోరాటం లో ప్రసిద్ధి గాంచినది. 1857 లో జరిగిని మొదటి స్వాతంత్ర పోరాటంలో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర వహించింది. ఈ ప్రాంతం పై చేసిన రీసెర్చ్ కు గాని ఒక పరిశోధకుడికి అప్పటి భారత రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం నుండి ఒక సర్టిఫికేట్ కూడా లభించింది.
1857 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగు బాటు మీరట్ లో మే 10 వ తీదీన మొదలవగా, ఢిల్లీ లో మే 11 వ తేదీన మొదలైంది. ఈ తిరుగుబాటు లో ఆరుగురు బ్రిటిష్ సైనికాధికారులను ఇక్కడి ప్రజలు చంపి వేసారు. ప్రజల ఈ చర్యకు ఆగ్రహించిన బ్రిటిష్ అధికారులు ఈ పట్టణాన్ని తగుల పెట్టారు. ప్రజలను చంపి వేసారు. ఈ ప్రాంతాన్ని చివరకు వారు ఒక సాగు భూమిగా మార్చారు.