చంద్రగిరి కోట చంద్ర గిరి నది పక్కన కలదు. ఒక పురాతన కోట కనపడుతూ మియు కొబ్బరి తోటలు, పక్కనే ఒక నది పారుతూ, మరో పక్క అరేబియా సముద్ర హోరు తో ఈ కోట ప్రదేశం అద్భుతంగా ఉంటుది. సూర్యాస్తమయాలు ఇక్కడ నుండి చూస్తె చాలా బాగుంటాయి. ఈ కోటను 17 వ శతాబ్ద్రం లో శివప్ప నాయక్ నిర్మించాడు.
ఈ కోట చరిత్ర చెప్పాలంటే, కొన్ని వందల ఏళ్ళ క్రిందట చంద్రగిరి నది కొలతునాడు మియు తుళునాడు లకు సరిహద్దు గా వుండేది. ఈ రెండు రాజ్యాలు చాలా బలమైనవి. విజయనగర చక్రవర్తి తుళునాడు వశం చేసుకున్నపుడు, చంద్రగిరి విజయనగర రాజ్యం లో భాగం అయింది. 16 వ శతాబ్దంలో విజయనగర రాజ్యం క్షీణించింది. అపుడు చంద్రగిరి స్వతంత్ర రాజ్యమై చంద్రగిరి కోటని తన రక్షణ కొరకు నిర్మించుకోంది .
తర్వాతి కాలంలో మైసూరు పాలకుడు హైదర్ అలీ దానిని స్వాధీనం చేసుకొన్నాడు. అతని తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దానిని హస్తగతం చేసుకోండి. ఇపుడు ఈ కోటని రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ నిర్వహిస్తోంది.