హిమాచల్ ప్రదేశ్ లోని మేక్లియాడ్ గంజ్ కి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక కేంద్రం భాగ్సు (భాగ్సునాగ్). ప్రాచీన దేవాలయాలకు, అందమైన జలపాతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ది. ఈ ప్రాంతం ధార్మిక ప్రాముఖ్యం వల్ల, ధర్మశాలకు దగ్గరగా ఉండడం వల్ల ఏడాది పొడవునా యాత్రీకులు ఇక్కడికి వస్తారు.
మేక్లియాడ్ గంజ్ కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగ్సు లోని పురాతన భాగ్సోనాగ్ దేవాలయం ఇక్కడి సుప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. శివుడి కోసం ఈ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయ ఆవరణలో చాలా అందమైన కొలనులు, వ్యాఘ్రముఖ కుండాలు ఉన్నాయి. వ్యాఘ్రముఖ కుండాలను హిందువులు పవిత్రమైనవిగా భావిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రాకృతిక పరిసరాలు ఈ ప్రాంత అందాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.
సముద్ర మట్టానికి 4342 మీటర్ల ఎత్తున ఉన్న ధవళాధర్ పర్వతశ్రేణులలో ఇంద్రహార్ పాస్ అనే ప్రముఖ పర్యాటక కేంద్రం ఉంది. చంబా, కాంగ్రా జిల్లాలకు ఈ పాస్ భౌగోళిక సరిహద్దుగా పనిచేస్తుంది. ఇక్కడికి ధర్మశాల లేదా మెక్లియాడ్ గంజ్ నుంచి పర్వతారోహణ ద్వారా చేరుకోవచ్చు. అంతేకాక ధర్మశాల నుంచి చంబా కు వెళ్ళే దారిలో వుండే మినికియాని పాస్ ను కూడా యాత్రికులు చూడవచ్చు. ఉత్తరం వైపు వుండే శిఖరాల నుంచి అందమైన పర్వతాల దృశ్యాలు చూడవచ్చు.
భాగ్సు (భాగ్సునాగ్)ను వివిధ రవాణా మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు.
భాగ్సు కి సమీపంలోని ధర్మశాల నుంచి న్యూడిల్లీ, కులు లాంటి నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతాయి. భాగ్సు నుంచి పఠాన్ కోట్ దగ్గరి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి టాక్సీలు, కాబ్ ల ద్వారా భాగ్సు చేరుకోవచ్చు. మెక్లియాడ్గంజ్, దిగువ ధర్మశాల నుంచి భాగ్సు కు నిత్యం బస్సులు తిరుగుతాయి.
భాగ్సు (భాగ్సునాగ్) లో మంద్రమైన వేసవి, చల్లటి శీతాకాలాలు మధ్యస్తమైన వాతావరణం వుంటుంది. తక్కువ వాతావరణం ఉన్నప్పటికీ, శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం, ప్రత్యేకంగా ఇక్కడి మంచు కురవడం చూడాలనుకుంటే. గడ్డ కట్టే ఉష్ణోగ్రత వద్దనుకుంటే వేసవి లో వాతావరణం బాగుంటుంది కాబట్టి అప్పుడు సందర్శించడం ఉత్తమం.