ప్రముఖ ధార్మిక కేంద్రం భాగ్సునాగ్ దేవాలయం, సముద్ర మట్టానికి 1770 మీటర్ల ఎత్తున వుంది. శివుడి కోసం నిర్మించిన ఈ దేవాలయం మధ్యయుగాల నాటి కళా, సంస్కృతులను చిత్రిస్తుంది. ఈ పురాతన దేవాలయాన్ని హిందువులు, గూర్ఖాలు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దేవాలయం ఆవరణలో అందమైన కొలనులు వున్నాయి. పర్యాటకులు ఇక్కడ వ్యాఘ్ర ముఖ కుండాలను చూడవచ్చు. స్థానికులు ఈ నీటికి ఔషధ గుణాలు వున్నాయని నమ్ముతారు. అంతేకాక ఈ దేవాలయంలోని విగ్రహాలకు అద్భుతమైన శక్తులు ఉన్నాయంటారు. ఈ ఆవరణలో వున్న రెండంతస్తుల భవంతిలో ఇక్కడికి వచ్చే యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు.
ఇతిహాసం ప్రకారం ఈ దేవాలయాన్ని భాగ్సు రాజు నిర్మించాడు. జానపదుల గాథల ప్రకారం భాగ్సు రాజు నాగ దల౦ చెరువు నుంచి నీరు దొంగిలించాడు కాబాట్టి అతనికి నాగరాజు తో యుద్ధం జరిగింది. తరువాత నాగ దేవత నుంచి క్షమాభిక్ష కోసం రాజు ఈ దేవాలయం నిర్మించాడు.