భరత్పూర్ లోని ప్రసిద్ధ లక్ష్మణ్ ఆలయం 400 సంవత్సరాల కిందటిదని విశ్వసిస్తారు. ఈ ఆలయం రాజస్థానీ నిర్మాణ శైలిని ఉదాహరిస్తుంది. ద్వారాలు, పైకప్పులు, స్తంభాలు, గోడలు ఆలయ తోరణాలు అద్భుతమైన రాతి పనితో అలంకరించబడి ఉంటాయి. భరత్పూర్ నగరానికి మధ్యలో ఉన్న ఈ ఆలయం రాముని తమ్ముడు లక్ష్మణుడి కి చెందినది. పురాణాలను ప్రకారం ఈ ఆలయాన్ని ‘నాగ బాబా’ అనే సాధువు నిర్మించాడు. ఇక్కడికి దగ్గరలో వేరొక లక్ష్మణ్ మందిరం కూడా ఉంది. లక్ష్మణునికి చెందిన ఈ మందిరాన్ని బలదేవ్ సింగ్ మహారాజు హయా౦లో 1870 లో నిర్మించారు. ఈ మందిరాన్ని ఇసుకరాయి, తెల్లని పాలరాయితో నిర్మించారు. ఈ ఆలయం రాముడు, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుని అష్టధాతు విగ్రహాలకి ప్రసిద్ది చెందింది. రెండు ఆలయాలకూ నగరంలోని ఏ ప్రాంతం నుండైనా సులువుగా చేరవచ్చు.