పాళీ తానా టెంపుల్స్ జైనులకు ఎంతో పవిత్రమైనవి. ఇవి సుమారు 3000 కు పైగా ఇక్కడ కల శత్రున్జయ కొండల పై భాగం లో కలవు. చక్కగా మార్బల్ నిర్మాణం కలిగి వుంటాయి. ఇక్కడి టెంపుల్ ను జైనుల మొదటి తీర్థంకరుడు అయిన ఆది నాధుడికి అంకితం ఇచ్చారు. మిగిలిన టెంపుల్స్ సుమారు 900 సంవత్సరాల కాలంలో వివిధ జైన మతస్తులచే నిర్మించ బడ్డాయి. వీటిలో కుమార్పాల్, విమల్ షా మరియు సంప్రితి రాజా ప్రధానమైనవి. జైనుడు అయిన ప్రతి ఒక్కరూ కొండ ఎక్కి ఇక్కడి మందిరాలను తమ జీవిత కాలంలో ఒక్క సారి దర్శించి జన్మ ధాన్యం చేసుకోవాలని వాన్చిస్తారు. ఈ కొండ దర్శనం వారికి మోక్షం ప్రసాదిస్తుందని భావిస్తారు.