పర్యాటకులు భీమేశ్వరి ఫిషింగ్ కేంప్ తప్పక చూడాలి. ఇది కావేరి నది ఒడ్డునే ఉంది. దీనిలోని మహసీర్ చేప ఆడే ఆటలు మీకు వినోదంగా ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ 200 కు పైగా పక్షి జాతులను చూడవచ్చు. వివిధ రకాల అడవి జంతువులను కూడా చూసి ఆనందించవచ్చు. జింకలు, సంబార్, ఏనుగులు, గుంటనక్కలు, చిరుతపులులు వంటివి ఎన్నో కనపడతాయి. చేపలు పట్టటం లేదా నదిపై ర్యాఫ్టింగ్ చేయటం, ట్రెకింగ్ ఏది చేసినప్పటికి మీకు తగిన శిక్షణకు నిపుణులున్నారు. కలప గుడిశెలు, గుడారాలు, కాటేజీలు, రెస్టరెంట్లు, కేంప్ ఫైర్ వంటివి ఈ ఫిషింగ్ కేంద్రంలో ఉన్నాయి. ఎన్ని చేపలను వేటాడినప్పటికి వాటిని ఇంటికి తీసుకు వెళ్ళడం నిషేధిస్తారు. జూన్ నుండి ఆగస్టు మరియు సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి భీమేశ్వరి ఫిషింగ్ కేంప్ సందర్శనకు అనుకూలంగా ఉంటాయి.