భీమశంకర్ దేవాలయం భీమశంకర్ గ్రామంలో కలదు. దీనినే పవిత్ర జ్యోతిర్లింగంగా పేర్కొంటారు. ఈ దేవాలయం శివభగవానుడి నిలయం. ఈ దేవాలయాన్ని నానా ఫడ్నవీస్ నిర్మించారు. ఇది మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలోను, దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలోను ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
శివభగవానుడు సహ్యాద్రి కొండలపై నివసించినపుడు భీముడి అవతారం ఎత్తి త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడని, యుద్ధం తర్వాత ఆయనకు పట్టిన చెమట కారణంగా ఆ చెమట ధారలకు పవిత్ర భీమా నది ఏర్పడిందని ఇతిహాసాలు చెపుతాయి. పవిత్రమైన ఈ జ్యోతిర్లింగం నాగర శిల్పశైలి కలిగి ఉంటుంది. 13వ శతాబ్దానికి చెందిన శాసనాలు ఇక్కడ కలవు.
ఈ ఆవరణలోనే ఒక చిన్న శని దేవాలయం కూడా ఉంటుంది. పక్కనే ఒక పెద్ద గంట కనపడుతుంది. ఈ రకమైన శైలి హేమందపతి శిల్ప శైలిని చూపుతుంది. ఈ మత ప్రదేశం భక్తులకు, యాత్రికులకు మాత్రమే ప్రసిద్ధి కాదు. అనేకమంది పక్షులను పరిశీలించేవారు మరియు ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి కలవారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆనందిస్తారు. దేవాలయ ఆవరణ ప్రత్యేకించి మహా శివరాత్రి వంటి వేడుకలలో కిక్కిరిసి జనసందోహాలతో ముచ్చటగా ఉంటుంది.