ఇండియా లో మొట్టమొదటి మ్యూజియం ఈ కచ్ మ్యూజియం. చిత్రాలు,అందమైన శిల్పా కళాఖండాలు మరియు పురాతన లిపి శాసనాలు, నాణేలు,సంగీత వాయిద్యాలు ఇలా అనేక ఆసక్తికర వస్తు సంకలనాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. గుజరాత్ లో హమిర్సర్ సరస్సు దగ్గర ఉన్న పురాతన ప్రదర్శనశాలల్లో ఇది ఒకటి. 1884 వ సంవత్సరం లో మహారో ఖేన్గార్జి lll పెళ్లి సందర్భంగా కొన్ని కళాఖండాలు ప్రదర్సన కోసం ఇక్కడ ఉంచటంతో ఈ మ్యూజియం ఆరంభమైనదని భావన.ఈ మ్యూజియం క్రీస్తుశకం 1 వ శతాబ్దం నాటి క్షత్రాప శాసనాలు అధిక సంఖ్యలో సేకరణ కలిగి ఉండటమే గాకుండా,ఇప్పుడు ఉనికిలో లేని పలు కుస్తీ స్క్రిప్ట్ శాసనాలు సేకరణ కూడా గలవు.