చాంద్ బావడి అంటే, మెట్లుకల బావి. ఈ నిర్మాణం 1557 - 1580 లలో పాలించిన అలి అదిల్ షా చే బీజపూర్ నగర తూర్పు సరిహద్దులలో నిర్మించబడింది. అదిల్ షా ఈ ట్యాంక్ ను తన భార్య చాంద్ బీబి పేరుపై నిర్మించాడు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత, ఎంతోమంది ప్రజలు బీజపూర్ ప్రవేశించారు. దానితో పట్టణంలో కొత్త ప్రదేశాలు అవసరపడటం దానికి తగిన సౌకర్యాలు ఏర్పరచడం జరిగింది. చాంద్ బావడి సుమారుగా 20 మిలియన్ లీటర్ల నీటిని ప్రజలకు అందించే సామర్ధ్యం కలిగి ఉంది. కొంతకాలం తర్వాత, ఈ ట్యాంక్ సైజులో నగరంలో మరి కొన్ని ట్యాంక్ లు కూడా నిర్మించారు. దీని చుట్టూ ఒక ప్రహరీ గోడ కూడా నిర్మించారు. అయితే, ఈ భవన సముదాయం చాలావరకు పాలకుల కుటుంబాల వినోద అవసరాలకు ఉపయోగించారు.