ఎంతో చారిత్రక ప్రాధాన్యతగల గోల్ గుంబజ్ ను సందర్శకులు తప్పక చూడాల్సిందే. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద సమాధి. బీజపూర్ సుల్తాన్ మహమ్మద్ అదిల్ షా సమాధి. 1490 మరియు 1696 ల మధ్య బీజపూర్ పాలించిన షాహి వంశ పాలకులలో అదిల్ షా ప్రధానమైనవాడు. ఈ భవనం యాకుత్ అనే ప్రముఖ శిల్పి చే నిర్మించబడింది. దీని వ్యాసం షుమారు 44 మీటర్లు ఉంటుంది. ఈ డోమ్ లోపలి భాగాలు ఏ ఆధారం లేకుండా నిలవటం అనేది ఒక మిస్టరీగా ఉంటుంది. ఇక్కడ చిన్న ధ్వని చేసినా వినపడుతుంది. చేసిన శబ్దం 7 రెట్లు ప్రతిధ్వనిస్తుంది. వేరువైపు స్పష్టంగా వినవచ్చు. రాజు అదిల్ షా అతని భార్య ఈ విధంగా సంభాషించేవారట. సంగీత గాయకులు ఇందులో కూర్చుని కచేరీ చేస్తే అది అన్నివేపులా వినపడుతుంది.ఈ కట్టడ శిల్పకళా నైపుణ్యం పరిశీలిస్తే, దీనిలో 4 గోపురాలు, 8 అంతస్తులు ఉంటాయి. ప్రవేశం మెట్లపైన ఉంటుంది. దీనిని ఒక ప్రహరీ కల గార్డెన్ లో నిర్మించారు. దీని విస్తీర్ణం సుమారు 1700 చ. మీటర్లు ఉండి ఎత్తు 51 మీటర్లవరకు ఉంటుంది.