బీజపూర్ లో 1549 లో షెర్జా బురుజుపై తన యుద్ధ విజయానికి రుజువుగా మహమ్మద్ అదిల్ షా నిర్మించిన ఒక అతి పెద్ద ఫిరంగిని కూడా చూడవచ్చు. దీనిని యుద్ధ ప్రభువు లేదా మాలిక్ ఎ మైదాన్ అని కూడా అంటారు. ఈ ఫిరంగి బీజపూర్ కు 3 కి.మీ. దూరంలో ఉంది. ఆ కాలంలో దీనిని అతి పెద్ద ఫిరంగిగా భావించేవారు. ఈ ఫిరంగి ముఖ భాగం ఒక సింహం తన కోరలు తెరచిన రీతిని గుర్తు చేస్తుంది. సింహం కోరలకు మధ్య ఒక ఏనుగు నలిపి చంపివేయబడినట్లుగా ఉంటుంది. ఈ ఫిరంగిపై ఔరంగజేబు కొన్ని వాక్యాలు వ్రాయించాడు.
55 టన్నుల ఈ ఫిరంగి షుమారు 1.5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీని పొడవు 4.45 మీటర్లుగా ఉంటుంది. ఈ చారిత్రాత్మక ఫిరంగి ప్రత్యేకత, దీనిని ఎంత వేడి ఎండలో పెట్టినప్పటికి అది ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. దీనిపై కొద్ది శబ్దం చేస్తే చాలు ఒక గంటవలే మోగుతుంది.