జునాఘర్ కోట బికనేర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దుర్భేద్యమైన ఈ కోటను 1593 లో రాయ్ సింగ్ మహారాజు నిర్మించారు. ఈ కోట చుట్టూ కందకంతో పాటు, అనూప్ మహల్, గంగా నివాస్, రాంగ్ మహల్, చంద్ర మహల్, ఫూల్ మహల్, కరణ్ మహల్, షీష్ మహల్ వంటి అనేక అందమైన భవనాలు ఉన్నాయి. అనూప్ మహల్ మైమరపించే బంగారు ఆకు చిత్రాలకు ప్రసిద్ది చెందింది. చంద్ర మహల్ గోడలు సున్నపు పూతతో తయారుచేయబడి, సున్నిత చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. పర్యాటకులు ఫూల్ మహల్ లోపల ఆకర్షణీయమైన అద్దాల పనిని చూడవచ్చు. కరణ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పై బికనేర్ రాజుల విజయానికి స్మారకంగా నిర్మించారు. ఈ భవనాలను దుల్మెరా అనే ఎరుపు ఇసుక రాయి తో నిర్మించారు.ఈ కోటకు 986 పొడవైన గోడలు, 37 బురుజులు, రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. పర్యాటకులు కోట ప్రధాన ద్వారమైన కరణ్ పోల్ నుండి లోపలికి రావచ్చు. కోట లోపల హర మందిర్ అనే చిన్న గుడి ఉంది. బికనేర్ రాజ కుటుంబీకులు దేవతలను పూజించడానికి దీనిని ఉపయోగించేవారు. దర్బార్ హాల్, గజ మందిరం, సూరజ్ పోల్ ఈ కోట లోని ఇతర పర్యాటక ఆకర్షణలు.