మల్హార్ బిలాస్ పూర్ నుండి 40 కి. మీ. ల దూరం. బిలాస్ పూర్ - రేయ్ ఘర్ మార్గం లో మస్తూరి బ్లాక్ నుండి 14 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని సర్వాపూర్ అని కూడా అంటారు. గతం లో ఇది చత్తీస్ ఘర్ రాజధాని గా వుండేది. ఇక్కడ అనేక పురా వస్తు ప్రదేశాలు కలవు.
ఇక్కడ 10, 11 శతాబ్దాల నాటి పతలేశ్వర్ టెంపుల్, దేవ్ రీ తెంప్లె, దిన్దేశ్వరి టెంపుల్ లు కలవు. జైనుల మత సంబంధ నిర్మాణాలు కూడా తవ్వకాలలో బయట పడ్డాయి. నాలుగు తలల విష్ణువు విగ్రహం ఇక్కడ టూరిస్ట్ లకు ప్రధాన ఆకర్షణ.
ఈ ప్రదేశం లో సుమారు 1000 బి.సి . ల నాటి కాలచూరి రాజవంశ నిర్మాణాల శిధిలాలు కూడా బయట పడ్డాయి. ఇక్కడ కల పాతాలేశ్వర్ కేదార్ టెంపుల్ లోని గోముఇఖి శివ లింగం ఆకర్షనీయం. దిన్దేశ్వరి టెంపుల్ కాలచూరి పాలన నాటిది. దేవోర్ టెంపుల్ లోని విగ్రహాలు ఎంతో కళాత్మకంగా వుంటాయి.
మల్హార్ లో ప్రభుత్వ మ్యూజియం కలదు. దీనిలో అనేక పురాతన శిల్పాలు వుంటాయి. ఈ ప్రదేశం గురించి చైనా చరిత్రకారులు సైతం చరిత్రలో పేర్కొన్నారు.