హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలలో బిర్ అనే ప్రాంతం ఒకటి. ఈ పట్టణం యొక్క జనాభాలో ఎక్కువ మంది పొరుగు దేశం అయిన టిబెట్ నుండి శరణార్ధులుగా వచ్చినవారే. వివిధ ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాలకి ప్రాచుర్యం పొందిన ఈ పట్టణంలో ధర్మాలయ ఇన్స్టిట్యూట్ మరియు డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి.
అధ్యయన కేంద్రాలే కాకుండా ఈ ప్రాంతం సాహస క్రీడల మజిలీ గా కూడా వ్యవహరిస్తుంది. పారాగ్లైడింగ్ రాజధానిగా పిలవబడే ఈ ప్రాంతంలో అనేకమైన పారాగ్లైడింగ్ స్పాట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో, టూరిజం శాఖ, సివిల్ ఏవియేషన్ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఇక్కడ 'పారాగ్లైడింగ్ ప్రీ వరల్డ్ కప్' ఈవెంట్ ని నిర్వహిస్తారు. అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన ఈ పారాగ్లైడింగ్ పోటీలని తిలకించడానికి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తారు.
అంతే కాకుండా, 1980 లో ప్రవేశపెట్టబడిన హాంగ్-గ్లైడింగ్ అనే మరొక సాహసోపేత కార్యక్రమాన్ని కూడా ప్రయత్నించవచ్చు. రోజు రోజు కి ఈ క్రీడ ప్రసిద్ది చెందుతోంది. ఈ క్రీడకి సంబంధించిన శిక్షణని ప్రతి సంవత్సరం హెచ్ టి డి సి లేదా హిమాచల్ ప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ అందిస్తుంది.
టిబెటన్ కాలనీ మరియు బిర్ టీ ఫ్యాక్టరీ అయిన చిక్లింగ్ గొంప ని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. నేచర్ వాక్ ని ఆస్వాదించే సౌకర్యం ఉండడంవల్ల ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకి అనువైన ప్రదేశం.
ప్రజాదరణ పొందిన రవాణా పద్దతుల ద్వారా ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. బిర్ కి దగ్గరలో పతంకోట్ విమానాశ్రయం ఉంది. ఇది 150 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ లేదా అంతర్జాతీయ విమానాశ్రయం లేదా IGI విమానాశ్రయం కూడా ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం.
బిర్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్, దేశంలోని వివిధ ప్రాంతాలకి చక్కగా అనుసంధానమయ్యే పతంకోట్ రైల్వే స్టేషన్. చండి గర్హ్ మరియు న్యూ ఢిల్లీ వంటి పట్టణాల నుండి బిర్ చేరుకునేందుకు బస్సులు అందుబాటులో కలవు.
ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ అందమైన హిల్ స్టేషన్ ని పర్యాటకులు సంవత్సరంలో ఏ కాలంలో నైనా సందర్శించవచ్చు.