దహను కోట బోర్డి గ్రామం నుండి సుమారు 24 కి.మీ. ల దూరంలో కలదు. నదికి ఉత్తరం దిశలో ఎత్తుగా కనపడుతుంది. ఈ కోట రాతిని తొలచి నిర్మించారు. కోట గోడలు సుమారు 38 అడుగుల ఎత్తు మరియు 10 అడుగుల వెడల్పు కలిగి ఉంటాయి. ఇతిహాసం మేరకు చిమాజీ రావ్ అప్పా నాయకత్వం క్రింద మరాఠాలు ఈ కోటను జనవరి నెల క్రీ.శ 1739 సంవత్సరంలో స్వాధీనం చేసుకొన్నారు. క్రీ.శ.1817 సంవత్సరంలో ట్రీటీ ఆఫ్ బెస్సీన్ క్రింద బ్రిటీష్ పాలకులు దహను కోటను వశం చేసుకున్నారు. తర్వాత దీనిని ఒక జైలుగా మార్పు చేశారు. నేటికి ఈ కోట అద్భుత ఆకర్షణ కలిగి ఉంటుంది. రమణీయమైన వాస్తు నిర్మాణం కలిగి చారిత్రకులకు నేటికి ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, 1818 సంవత్సరంలో ఈ కోట టెర్రస్ భాగం ధ్వంసం చేయబడింది. బోర్డి సందర్శకులకు దహాను కోట ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.