ఆహార్ బులంద్షహర్ గంగా నది ఒడ్డున ఉన్న చిన్న పట్టణము. ఇది అవంతిక మరియు శివుడు యొక్క పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాలలో ముఖ్యంగా శివరాత్రి మరియు నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి. సంవత్సరం పొడవునా భక్తులను ఆకర్షిస్తుంది.
గంగా నది ఒడ్డున ఉన్న ఆహార్ మహాభారతం కాలం నాటి చారిత్రిక మూలాలను కలిగి ఉంది. పురాణంలో ఒక కథ ప్రచారంలో ఉంది. మహాభారతంలో దుర్యోధనుడు భీముడిని చంపటానికి విష ప్రయోగం చేసి భీముడిని గంగా నది లోకి విసిరెను. ఆహార్ ను పాలించే నాగవంశి పాలకులు భీముడికి నయం చేసి హస్తినాపూర్ కు తీసుకువచ్చారని చెప్పుతారు. ఇక్కడ నాగవంశి కాలంనకు చెందిన కొన్ని నాణేలు గుర్తించబడ్డాయి.