1660 లో చతర్ శాల్ నిర్మించిన చాత్ర మహల్ ముఘలాయిలు దేశాన్ని పాలిస్తుండగా రాజపుత్రులు ఈ ప్రాంతంలో రాజ్యం ఏలారనడానికి బలమైన సాక్ష్యం. ముఘలాయి లు నిర్మించిన ఎర్ర ఇసుకరాయి నిర్మానాల్లా కాకుండా, చతర్ శాల్ ఈ భవనాన్ని బుండీ లోని క్వారీలలో దొరికిన రాళ్ళతో నిర్మించాడు. ఈ భవనం లోపల కుడ్య చిత్రాల శైలి లోని చిత్రాలు వుండగా, వాకిళ్ళ పై అద్దాలు, ఏనుగు దంతాలతో చేసిన పనితనం వుంది.