నగరంలోని సూర్య రశ్మి పడే అడవులలో సుఖ్ మహల్ నుంచి కొద్ది దూరంలో వున్న శిఖర్ బురుజ్ బుండీ పాలకులు వేటకు ఉపయోగించిన విడిది. 18వ శతాబ్దంలో బుండీ ని పాలించిన ఉమ్మేద్ సింగ్ రాజ్య త్యాగం చేసాక ఇక్కడే నివసించాడు. శిఖర్ బురుజ్ ను ప్రస్తుతం విహార కేంద్రంగా తీర్చిదిద్దగా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయింది.