75 ఎకరాల మేరకు విస్తరించబడిన చైల్ పాలసు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. పాటియాలా రాజు అయిన మహారాజా అధిరాజ్ భూపిందర్ సింగ్ వారు ఈ పాలసుని 1891 లో నిర్మించారు. రాజ్ గర్ హిల్స్ పై ఉన్న ఈ పాలసు చుట్టూ ఉండే అందమైన పచ్చని పైన్ మరియు డియోడార్ వృక్షాలు సందర్సకులకి కనువిందు చేస్తాయి. చైల్ యొక్క రాచరికపు వారసత్వానికి సాక్ష్యంగా పరిగణించబడే ఈ పాలసు, రాజు యొక్క వేసవి రాజధానిగా వ్యవహరించింది.