1907 లో నిర్మించబడిన గురుద్వారా సాహిబ్, పాండవ హిల్స్ పైన ఉంది. చైల్ బజార్ నుండి కేవలం ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ది చెందినది. సిక్కుల మందిరమే అయినా, దీని నిర్మాణ శైలి గోవా లోని కొన్ని చర్చుల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. చుట్టూ పచ్చని లాన్ లతో ఉండే ఈ పసుపు పచ్చటి ఆకృతి చుట్టు పక్కల ప్రాంతాల్లో అద్భుతమైన దృశ్యం. ప్రతీ రోజు అనేకమంది భక్తులు అధిక సంఖ్యలో ఈ మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరం ప్రధాన ప్రవేశ ద్వారంలో రెండు బురుజులు ఉన్నాయి.