ఈ చంబల్ అభయారణ్యంలో జంతువులూ, పక్షులు మాత్రమే కాకుండా మీరు యమునా నది పై ఉన్న బతేశ్వర్ ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. ఈ ప్రాంగణంలో శివుడి విగ్రహం ఉన్న వందకంటే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. బతేశ్వర్ ని శ్రీకృష్ణుని జన్మస్థలంగా భావిస్తారు, అందువల్ల ఇది అనేక పురాణాలూ, కధలతో ముడిపడి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ చాలా లోయలు కూడా ఉన్నాయి, ఈ ప్రాంతం మట్టి ఇల్లు, గుహలలో నివసించే నాగ సాధువులకు ఒక పెద్ద కేంద్రంగా ఉంది.
సమీపంలోని యమునా నది, దాని పరిసరాలు ఇతర పక్షులతో పాటు లకుముకిపిట్ట, పెలికాన్ వంటి వలస పక్షులకు ఆవాసంగా ఉంది.
నవంబర్ నెలలో, ఈ ఆలయ ప్రాంగణంలో బహిరంగ గోడల వల్ల వార్షిక జంతు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవ౦ యోగులను, సాధువులని, వర్తకులను, గ్రామం చుట్టూ ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది.