చంబల్ యాత్ర మిమ్మల్ని చంబల్ అభయారణ్యం ద్వారా తీసుకువెళుతుంది, ఇది రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మూడు రాష్ట్రాల నిర్వహణలో ఉంది. 1979 లో స్థాపించబడిన ఈ అభయారణ్యం 400 కిలోమీటర్లు చంబల్ నది విస్తరించి, నది చుట్టూ 1235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.
ఈ చంబల్ అభయారణ్యాన్ని జాతీయ చంబల్ మొసళ్ళ వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు, ఇది అంతరించిపోతున్న మొసళ్ళకు (మొసళ్ళు) రక్షణ ప్రాంతంగా పనిచేస్తుంది.
చంబల్ నది భారతదేశం లోని అత్యంత సహజమైన నదులలో ఒకటి. దీని పుట్టుక ‘అపవిత్రమైనది’ గా భావించడం వల్ల ఇది ఇప్పటికీ కలుషితం కాకుండా ఉండిపోయింది. ఈ నది రంతిదేవ రాజు త్యాగంతో వందల ఆవుల రక్తం నుండి పుట్టిందని పురాణాల కధనం. ఇందుకు ప్రజలు ఈ నీటిని సరీసృపాలకు, పక్షులకు వదిలివేశారు.
చంబల్ అభయారణ్యం పక్షుల అభయారణ్య జాబితాలో ఉంది, ఇది 330 కంటే ఎక్కువ జాతుల స్థానిక, వలస పక్షులను ఆకర్షిస్తుంది, ఈ పక్షుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది.