శుద్ధమైన నీరు గలగలా పర్వతాల మధ్య నుండి పారుతోంటే కనపడే ద్రుశ్యం అతి రమణీయంగా ఉంటుంది. చుట్టుపక్కల గల ప్రశాంత ప్రక్రుతి ద్రుశ్యాలు ఈ రమణీయ జలపాతానికి మరింత ఆకర్షణ ఇస్తాయి. ఈ సంరక్షణా కేంద్రం వారణాసి నుండీ 55 కీమీ దూరంలో ఉంది. సాధారణంగా యాత్రికులు ఇక్కడకి పగలు వచ్చి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యేటట్లుగా వస్తారు. ఇక్కడ రాత్రికి బస చేయడానికి ఏర్పాట్లు లేకపోయినా అనేక ఫలహార శాలలున్నాయి.