నిష్కల్మషమైన ప్రదేశం తో నీరు ఉండే అద్భుతమైన ప్రదేశం ఈ పరమేశ్వర్ తాల్. చారిత్రక నగరమైన చందేరి నుండి అర మైలు దూరం లో ఈ వాటర్ ట్యాంక్ ఉంది. బందేలా రాజ్ పుట్ రాజులచేత ఈ అందమైన వాటర్ ట్యాంక్ నిర్మించబడింది. ఈ ట్యాంక్ ఒడ్డున అందమైన ఆలయం ఉంది. ఈ ఆలయం లక్ష్మణుడికి అంకితమివ్వబడినది.
అందమైన చెక్కడాలతో ఈ ఆలయం సుందరమైన ప్రదేశం గా ప్రసిద్ది చెందింది. 18 వ శతాబ్దం లో ఆనిరుధ సింగ్ అనబడే బందేలా రాజు చేత ఈ ఆలయం నిర్మించబడింది. ఆ కాలం నాటి వైభవోపేతమైన నిర్మాణ శైలికి ఇది సాక్ష్యం గా నిలుస్తుంది. పరమేశ్వర్ తాల్ కి చెందిన ఎన్నోస్మారకాలు కూడా ఉన్నాయి. రాజ్ పుట్ రాజుల గౌరవార్ధం ఈ స్మరకలు నిర్మించబడ్డాయి. పరమేశ్వర్ తాల్ యొక్క అద్భుతమైన వీక్షణ కోసం అలాగే పరిసరాల ప్రశాంత వాతావరణం కోసం అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు.