చందేరి లో ఉన్న ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ ఇది. స్మారక నగరమైన చందేరీ కి నైరుతి వైపున 26 కిలో మీటర్ల దూరంలో ఉన్న పురాతన గ్రామం ఇది. అందరికీ పర్యాటక ఆకర్షణ అయిన ఈ ప్రదేశం జైనులకి ఏంతో ముఖ్యమైనది. ఈ ప్రశాంతమైన గ్రామం లో ఎన్నో జైను మందిరాలు కలవు. పూర్వం నుండి ఈ ప్రాంతం లో జైన సంస్కృతీ యొక్క ప్రాచుర్యానికి ఈ ప్రాంతం సాక్ష్యంగా నిలుస్తుంది. మధ్యయుగ కాల ప్రారంభ సమయం లో ఈ ఆలయ నిర్మాణాలు జరిగాయి. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఈ కుగ్రామాన్ని తమకి ప్రధానమైన సంస్కృతిక మజిలీగా భావిస్తారు.