పాతాల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీ. ఎగువన ఉన్నది. ఇది భువనేశ్వర్ సమీపంలో ఉన్నది. దీనిని శివుడికి అంకితం చేసినా, ఇక్కడ, ఈ గుహలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు. ఒక సన్నని సొరంగం మార్గం ద్వారా గుహలోకి వెళుతున్నప్పుడు స్టాలగ్మైట్ రాతి నిర్మాణాలు మరియు వివిధ దేవతల చెక్కిన చిత్రాలను చూడవొచ్చు. ఈ ఆలయం గంగోలిహాట్ ఉత్తర-తూర్పు దిశ నుండి 16 కి. మీ. దూరంలో ఉన్నది మరియు ఇక్కడనుండి రాజ్ రంభ,పంచాచులి,నందా దేవి మరియు నందా ఖాట్ పర్వత శిఖరాల సౌందర్యాలను వీక్షించవొచ్చు. ఈ ప్రాంతంలో మతపరమైన ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంవలన దీనిని పవిత్రమైన చార్ ధామ్ కు సమానంగా దీనిని భావిస్తారు.