గతంలో చౌల్ పోర్చుగీసు పాలకుల పట్టణంగా ఉండేది. ఇపుడు దీనిలో చాలాభాగం శిధిలావస్ధలో కలదు. ఈ పట్టణం ముంబైనుండి దక్షిణ దిశగా 111 కి.మీ.ల దూరంలో మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ జిల్లాలో కలదు.
చరిత్ర తిరగేస్తే, పోర్చు గీస్ పాలకులు 500 సంవత్సరాల క్రిందట మొదటగా చౌల్ లో స్ధిరపడ్డారు అయితే, ఈ పట్టణాన్ని అహ్మద్ నగర్ కు చెందిన నిజాం షాహి సుల్తాన్ పాలనలో 1570 లో విధ్వంసం చేశారు. చౌల్ పట్టణం మరోమారు 1613 లో పునర్నించబడింది.
సందర్శనా స్ధలాలుఈ పర్యాటక ప్రదేశం ఆలిబాగ్ సమీపంలో కలదు. చౌల్ పట్టణం ఎన్నో రాజవంశాలు పాలనకు రావటం నశించిపోవటం చూసింది. పట్టణంలో పోర్చుగీస్ శిధిలాలు మరియు అనేక చర్చ్ లు, యూదుల ప్రార్ధనాలయాలు ఉంటాయి. చౌల్ కాడు లైట్ హస్ కోర్లై పోర్ట్ సమీపంలో అందంగా నిలబడి ఉంటుంది. కోర్లై కోట మరియు చౌల్ కోట లు రెండూ కూడా చారిత్రక ప్రధానమైనవే. ప్రకృతి ప్రియులు సహజ అందాలు కల రేవదండ బీచ్ తప్పక చూసి ఆనందించాలి. ఈ ప్రదేశంలో కల దత్త మందిరం మతపరంగానే కాక చారిత్రక పరంగా కూడా విశేషత కలిగి ఉంది. ఎత్తైన ఈ ప్రదేశం నుండి చూస్తే రమణీయంగా ఉంటుంది.
కొన్ని వాస్తవాలు చౌల్ లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. అధిక వేడి ఎపుడూ ఉండదు. ఈ చారిత్రక ప్రదేశాన్ని చూసేందుకు చలికాలం బాగుంటుంది.
చౌల్ అన్ని ప్రధాన నగరాలకు వాయు, రైలు మరియు రోడ్డు ద్వారా అనుసంధానించబడింది. చిన్నది మరియు ఆకర్షణ కల ఈ పట్టణం ఎల్లపుడూ మీ పర్యటనకై వేచి ఉంటుంది. వెంటనే వెళ్ళి ఈ చారిత్రక ప్రదేశాన్ని చూసి ఆనందించండి.