దత్తమందిరం రేవదండ లో కలదు. దీనిలో మహారాష్ట్రులు పూజించే దత్తాత్రేయుడు విగ్రహం కలదు. ఈ దేవాలయాన్ని శివాజి పాలనలో శత్రువులను గమనించేందుకు నిర్మించినట్లు చెపుతారు. దత్తాత్రేయుడి జన్మదినం వైభవంగా అయిదు రోజుల పాటు జరుపుతారు. ఈ సమయంలో పాఠ శాలలకు సెలవులు కూడా ఇస్తారు. ఈ దేవాలయం కొండ శిఖరంపై కలదు. సుమారు 1500 మెట్లు ఎక్కాలి. పైకి ఎక్కి చూస్తే, చౌల్ మరియు రేవదండ పట్టణాలు ఎంతో రమణీయంగా కనపడతాయి.