చెన్నై లోని అష్టలక్ష్మి ఆలయం సంపదకు, శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీదేవి, రెండవ అవతారాలుగా నమ్మే ఎనిమిది హిందూ దేవతలకు అంకితం చేయబడింది. ఈ దేవత కూడా విష్ణుమూర్తి భార్యే. పురాణాల ప్రకారం, లక్ష్మీ దేవి మన జీవితంలో సంపాద తరువాత ఆరోగ్యం, జ్ఞానం, సంతానం, శక్తి, బలం మొదలైన రూపాలలో కనిపిస్తుంది. అష్టలక్ష్మి దేవతను ఎల్లపుడూ ఒక గుంపుగా పూజిస్తారు.
ఈ ఆలయం బిసెంట్ నగర్ బీచ్ తీరం మీద ఉంది, ఇక్కడ నాలుగు స్థాయిలు ఉన్నాయి. ఈ ఆలయం వద్ద ఎనిమిది దేవతల విగ్రహాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. మహాలక్ష్మి, మహావిష్ణు దేవతల మందిరాలు ఉన్న రెండవ స్థాయి నుండి ఈ దేవతలను పూజించడం ప్రారంభిస్తారు. మూడవ భవనంలో శాంత లక్ష్మి, విజయ లక్ష్మి, గజలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. నాలుగవ భవనంలో ఒక్క ధనలక్ష్మి దేవత విగ్రహం మాత్రమే ఉంది. మొదటి భవనంలో ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి.