చెన్నై లోని బిర్లా ప్లానెటేరియం తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (టి ఎన్ ఎస్ టి సి)లో వుంది. ఇది గాంధీ మండపం రోడ్డు మీద వున్న పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంగణం లో వుంది. ఈ ప్లానేటేరియం చెన్నై లో 1988 లో స్థాపించారు.
మీరు పిల్లలతో వెళ్తే ప్లానెటేరియం తప్పక చూడాలి. ఇక్కడి నుంచి కూర్చొని ఉండగానే మిమ్మల్ని విశ్వ యాత్రకి తీసుకు వెళ్తారు కనుక, ఇది వారికి విద్యతో పాటు వినోదాన్ని అందిస్తుంది.
2009 లో ఈ ప్లానెటేరియం లో దేశంలోనే మొట్టమొదటి సారిగా 360 డిగ్రీల స్కై థియేటర్ ఏర్పాటు చేసారు. దీనికి దాదాపు 2.1 మిలియన్ రూపాయలు ఖర్చయింది.
ఖగోళ శాస్త్రం లో ఆసక్తి వున్న వారు ఖగోళ శాస్త్ర కోర్స్ లోను, రాత్రి పూట ఆకాశాన్ని గమనించే కోర్స్ లోను చేరవచ్చు. ఈ ప్లానెటేరియం లో ఒక క్లాస్ రూమ్ స్టూడియో, అలాగే విద్య కోసం ఒక సెమినార్ హాల్ వున్నాయి. ఈ ప్లానెటేరియం ఆవరణలో చాలా సదస్సులు, సమావేశాలు జరుగుతాయి, ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు ఇక్కడికి వచ్చి ఖగోళం పై ఉపన్యాసం ఇస్తారు.