చెన్నై కి పశ్చిమాన ఉన్న శివారు ప్రాంతం తిరువేర్కాడు లో ఈ ఆలయం ఉంది. తిరువేర్కాడు అంటే 'పవిత్రాక్ మూలికల అడవి' అని అర్ధం. ప్రాచీన కాలం లో ఈ అడవి యొక్క చుట్టు పక్కల ప్రాంతాలు ఇక్కడ పెరిగే ఔషద మొక్కల వల్ల ప్రాచుర్యం పొందాయి. కేవలం ఈ తిరువేర్కాడు అడవి లో నే లభించే కొన్ని రకాల ఔషధ మూలికల కోసం ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఎక్కువ. దేవి కరుమరిఅమ్మన్ ఆలయం కూడా ఈ ప్రాంతం లో ప్రసిద్ది చెందినది.
పురాణాల ప్రకారం, కరుమరి అమ్మన్ ఒక వృద్ద దిమ్మరి స్త్రీ గా మారిపోయింది. సూర్య దేవుని వద్దకు వెళ్లి తన భవిష్యత్తుని చెప్తానంది. సూర్య దేవుడు ఈ వృద్ధ మహిళను గుర్తుపట్టక మర్యాద ఇవ్వలేదు. అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెంది అక్కడి నుండి వెళ్ళిపోయింది . అమ్మవారు వెళ్ళిపోగానే సూర్యుడి వెలుగు కోల్పోయి భూమి పైన అంటా చీకటి ఏర్పడింది . తన పొరపాటు తెలుసుకొని సూర్యుడు వెళ్లి ఆమెని క్షమాపణ వేడుకొంటాడు . అలాగే ఏడవ రోజు దేవికుమారి రోజు గా జరుపుకోమని , అలాగే తన సూర్య కిరణాలతో సంవత్సరం లో రెండు సార్లు దేవి పై కురిపించటానికి అనుమతి కుడా తీసుకున్నాడు . అప్పటినుండి ఆదివారం దేవికుమారి రోజు గా ఈ అమ్మవారి భక్తులు జరుపుకుంటారు , మరియు ప్రతి ఏటా పంగుని మరియు పురాత్తసి నెలలలో దేవి విగ్రహం పై న సూర్యకిరణాలు కురుస్తాయి .