శ్రీ కృష్ణుని మందిరం అయిన ఈ పార్ధ సారధి దేవాలయం త్రిప్లికెన్ లో చెన్నై లో ఉన్నది . 8దవ శతాబ్దం లో నిర్మితమైనదిగా భావించే ఈ దేవాలయం ఆళ్వార్ మునుల చే వారి రచనలలోగొప్పగా చెప్పబడినది .
పార్ధ సారధి అంటే అర్జుని యొక్క రథ సారధి అని సంస్కృతం లో అర్ధం . మహాభారత యుద్ధ సమయాన భగవంతుడు శ్రీ కృష్ణుడు అర్జునుని రథ సారధి గా వ్యవహరిస్టారు, నరసింహవర్మన్ చే నిర్మించబడినది ఈ మందిరం. కృష్ణ, నరసింహ, రామ మరియు వరాహ అనే శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఈ దేవాలయం లో మందిరాలు ఉన్నాయి. రాముని మరియు నరసింహుని మందిరానికి ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఉన్నాయి.
చెన్నై లో అతి పురాతన నిర్మాణంగా ఈ దేవాలయం ప్రసిద్ది. అందువల్లే అనేక మంది పర్యాటకులు ఈ మందిరాన్ని చూడడానికి వస్తారు. అంతే కాక, ఈ దేవాలయం లో ని అందమైన అధ్బుతమైన చెక్కడాలు స్తంభాలపై చూడవచ్చు.