కర్నాటకలో కొత్తగా ఏర్పడిన చిక్కబల్లాపూర్ జిల్లాకు హెడ్ క్వార్టర్స్ చిక్కబల్లాపూర్ పట్టణం. ఈ జిల్లా గతంలో కోలార్ లో ఒక భాగంగా ఉండేది. ఈ జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి. చిక్కబల్లాపూర్ పట్టణం బెంగుళూరు నగరానికి షుమారు 50 కి.మీ. ల దూరంలో ఉంది. ఇది చిక్కబల్లాపూర్ జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ జిల్లా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ఇంజనీర్ శ్రీ విశ్వేశ్వరయ్య జన్మ స్ధలం. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముద్దెనహళ్ళి విశ్వేశ్వరయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, శ్రీ సత్య సాయి బాబా యూనివర్శిటీ వంటి ఉన్నత విద్యా సంస్ధలతో విద్యారంగంలో ఈ జిల్లా బాగా అభివృధ్ధి చెందింది.
పట్టణ చుట్టు పక్కల ఆకర్షణలు చిక్కబల్లాపూర్ కు చుట్టుపట్ల ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలున్నాయి. వాటిలో సహజమైనవి కొన్ని కాగా మరి కొన్ని మనం నిర్మించినవి. ప్రఖ్యాత నంది హిల్స్ చిక్కబల్లపూర్ తాలూకాలో ఉంది.నంది హిల్స్ పైగల యోగ నందీశ్వర దేవాలయం, కొండ కిందిభాగంలో కల భోగ నందీశ్వర దేవాలయం ప్రధాన ఆకర్షణలు. చిక్కబల్లపూర్ పట్టణానికి 12 కి.మీ. ల దూరంలో వివేకానంద జలపాతాలు కలవు. వర్షా కాలంలో ఈ ప్రదేశం జలపాతంతో ఎంతో అందంగా ఉంటుంది. చిక్కబల్లపూర్ సమీపంలోగల రంగస్ధల లో అందమైన దేవాలయం నల్లటి రాతితో నిర్మించబడి, సుందరమైన విజయనగర శిల్ప శైలిలో శ్రీ మహా విష్ణువు విగ్రహం కలిగి ఉంటుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే గల ముద్దెన హళ్ళి శ్రీ విశ్వేశ్వరయ్య జన్మస్ధలం. నేటికి ఆయన నివాసం ఒక మ్యూజియంగా సంరక్షించబడుతోంది. చిత్రావతిలో సుబ్రమణ్యేశ్వర దేవాలయం, ఎల్లోడ్ లో శ్రీ లక్ష్మీ ఆదినారాయణ స్వామి దేవాలయం, కందవార సరస్సు లు కూడా ఆకర్షణీయ సమీప ప్రదేశాలు.
ఇక్కడకల కొన్ని కొండలు, పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. బెంగుళూరు నగరానికి దగ్గరగా ఉండటంతో చిక్కబల్లాపూర్ చేరాలంటే రవాణా సమస్యలుండవు. పర్యాటకులు రోడ్డు లేదా రైలు మార్గాలలో తేలికగా చేరవచ్చు.