భోగ నందీశ్వర దేవాలయం నంది హిల్స్ పైభాగంలో సముద్ర మట్టానికి షుమారు 4851 అడుగుల ఎత్తున నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 806 లో బాణ వంశానికి చెందిన రత్నవల్లి ద్రవిడ శిల్పశైలిలో నిర్మించారు. ఈ దేవాలయం యోగ నరసింహ మరియు శ్రీ ఉగ్ర నరసింహ దేవతా మూర్తులు కలిగి ఉంటుంది. భోగ నందీశ్వర దేవాలయానికి దగ్గరలోనే సోప్ రాతితో నిర్మించబడిన శ్రీ అరుణాచలేశ్రవ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని కూడా అనేకమంది పర్యాటకులు దర్శిస్తారు.