నామాల కోటకు అతి పెద్ద చారిత్రక ప్రాధాన్యత కలదు. చిఖల్ ధార ప్రాంతంలో కల ఈ కోట ఎన్నో అంశాలపట్ల అనగా వాతావరణం మొదలైన అంశాల పట్ల శ్రద్ధ వహించి నిర్మించబడింది. టెలియాఘర్, జఫ్రాబాద్ మరియు నార్నాల అని మూడు కోటలు కలసి షహనూర్ కోట ఏర్పడింది. నామాల కోట దట్టమైన అడవులు, కొండల మధ్య ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 973 మీటర్ల ఎత్తున కలదు. ఈ కోట నిర్మాణానికి కారకులు ఏ రాజ వంశస్ధులనేది ఇప్పటికి ప్రశ్నార్ధకమే. చరిత్ర వివిధ రకాలుగా వ్రాయబడింది.