చిక్కమగళూరు సందర్శనలో పర్యాటకులు బాబా భూదాన్ గిరి హిల్స్ తప్పక చూడాలి. ఈప్రాంత అటవీ ప్రదేశాలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఈ ప్రదేశాన్ని దత్తగిరి హిల్ రేంజ్ (ఇనాం దత్తాత్రేయ పీఠం) అని కూడా అంటారు. ఇది షుమారు 1895 మీటర్ల ఎత్తున ఉన్న ప్రదేశం. పట్టణానికి 28 కి.మీ. దూరంలో ఉంది హిందువులకు, మరియు ముస్లింలకు యాత్రా స్ధలంగా కూడా ఉంది. ఈ కారణంగా ఈ ప్రదేశానికి హిందువుల భగవంతుడు గురు దత్తాత్రేయ మరియు ముస్లిం ప్రవక్త బాబా భూదాన్ పేరు పెట్టారు. బాబా భూదాన్ గిరి సందర్శించే సందర్శకులు ఇక్కడే ముగ్గురు సిద్ధ పురుషులచే పవిత్రంచేయబడిన మూడు గుహలను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రాంతానికి దగ్గరలో శీతల అనే మరో ప్రసిద్ధ ఆకర్షణ ఉంది. ఇక్కడ శీతల-మల్లిఖార్జున స్వామి మరియు ఒక మఠం కూడా ఉన్నాయి. సమయం అనుకూలిస్తే సందర్శకులు ఇక్కడకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మాణిక్యధార జలపాతాలను కూడా చూడవచ్చు. పర్వతారోహణ, ట్రెక్కింగ్ వంటివి ఇష్టపడే వారికి బాబా భూదాన్ గిరి చక్కటి ప్రదేశం. ఇక్కడ రెండు పర్వత శ్రేణులున్నాయి. వాటిని ములాయంగిరి (1930 మీటర్ల ఎత్తు) మరియు దత్తగిరి అంటారు. ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ‘కురింజి’ పువ్వును కూడా చూడవచ్చు. పక్షులపట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది.