22మీ. ఎత్తులో ఉన్న ఏడు అంతస్తుల బురుజైన కీర్తి స్తంభాన్ని, ప్రతిష్ట బురుజు అని కూడా అంటారు.ఇది మొదటి తీర్థంకరుడైన అధినాధునికి చెందినది. వసారాలు, గోడల పై అందమైన చెక్కడాలతో దీనిని సోలంకి శైలి లో నిర్మించారు. బురుజుల గోడలపై జైన తీర్థంకరుల చిత్రాలను చూడవచ్చు. అంతేకాక, రెండవ అంతస్తులో అద్భుతంగా చెక్కిన అధినాథుని శిల్పం ఉంది. ఈ దేవాలయ ఏడవ అంతస్తునుండి అద్భుతమైన చిత్తోర్ ఘడ్ నగర సమగ్ర దృశ్యాలను చూడవచ్చు.