కుంభ శ్యామ్ దేవాలయం, ఇక్కడ వరాహస్వామిగా పూజలందుకొనే విష్ణు మూర్తి (ఆయన అడవి పంది అవతారం)కి చెందినది. ఈ దేవాలయాన్ని తన కోడలైన మీరా ప్రత్యేక అభ్యర్ధన పై మొదటి మహారాణ సంగ్రామ్ సింగ్ నిర్మించాడు. ఇది చిత్తోర్ ఘడ్ కోటలో కుంభ దేవాలయానికి దగ్గరగా ఉంది.ఈ దేవాలయ నిర్మాణం చిత్తోర్ ఘడ్ లోనే ఉన్న కాళికా మాత దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఒక పిరమిడ్ రూపంలో గల బురుజు, ఒక ఎత్తైన పై కప్పుతో మీరా గురువైన వారణాసికు చెందిన సంత్ రవిదాస్ పాదముద్రలు ఈ అందమైన దేవాలయంలో ఉన్నాయి. ఈ దేవాలయపు గోడలపై చాల మంది దేవుళ్ళు, దేవతల అందమైన చిత్రాలు ఉన్నాయి. నిర్మలమైన వాతావరణ౦, ధార్మిక ప్రాముఖ్యత, ఈ ప్రాంతానికి చెందిన కథలే ఇక్కడికి భక్తులు తరలి రావడానికి గల కారణం.