చిత్తోర్ ఘడ్ లోనే ప్రముఖ ధార్మిక కేంద్రాలలో సంవరియాజి దేవాలయాలను పరిగణిస్తారు. ఈ దేవాలయాలు కృష్ణుని అవతారమైన సంవరియాజి కు చెందినవి.హిందూ భక్తులకు, ప్రత్యేకంగా ఉత్తర భారతీయులకు ఈ దేవాలయాలు ఎంతో పూజనీయం. వీనిలో రెండు దేవాలయాలు 76 వ జాతీయ రహదారి పై ఉండగా, మూడవ దేవాలయం, జాతీయ రహదారి పై భద్సోడ కూడలి నుండి 1 కిలోమీటర్ దూరంలో భద్సోడ గ్రామంలో ఉంది.ఈ దేవాలయాలకు ఒక ఆసక్తి కరమైన కథ ఉంది.250 ఏళ్ళ క్రితం భోలారం గుర్జార్ అనే పశువుల కాపరి భద్సోడలో ఈ దేవతకు చెందిన విగ్రహాలు 4 పాతి పెట్టిబడినట్లుగా కల గన్నాడని విశ్వసిస్తారు. ఈ ప్రాంతాన్ని తవ్వి ఈ విగ్రహాలను తీసారు, అయితే ఈ క్రమంలో వీనిలో ఒకటి ద్వంసం కాగా, తిరిగి పాతి పెట్టారు.మూడు దేవాలయాలలో ప్రతిష్టించిన మిగిలిన విగ్రహాలను సంవరియాజిగా పూజిస్తున్నారు. ఈ విగ్రహాలు వేణువు ఊదుతున్న కృష్ణుని అందమైన రూపాన్ని వర్ణిస్తాయి. అద్భుత మహిమలకు ప్రసిద్ధమైన ఈ దేవత దీవెనల కోసం భక్తులు ఈ దేవాలయానికి వస్తారు.