సత్బిస్ దేవోరి దేవాలయం, మోహన్ మగ్రి లోపల ఉన్న ఒక పవిత్ర జైన దేవాలయం.మోహన్ మగ్రి, 1567 లో చిత్తోర్ ఘడ్ పై మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆక్రమణల కాలంలో నిర్మించిన ఒక గొప్ప కట్టడం. ఈ నిర్మాణాన్ని చిత్తోర్ ఘడ్ కోట లోపలికి నేరుగా ఫిరంగుల నుండి కాల్చేందుకు అందనంత ఎత్తులో నిర్మించారు. జైన మతం, సంస్కృతులకు చెందిన అనేక సంప్రదాయాలను, నమ్మకాలను తెలిపే ఒక అందమైన కట్టడం సత్బిస్ దేవోరి దేవాలయం. భక్తుల మనసుపై ఈ దేవాలయపు కళాత్మక చెక్కడాలు ఒక చెరగని ముద్ర వేస్తాయి. తుల్జ భవాని దేవాలయం, సింగర్ చౌరీ, నౌలఖ భండార్ మోహన్ మగ్రి ప్రాంగణం లోపల ఉన్న ఇతర ఆకర్షణలు.