సీతామాత అభయారణ్యం ఆరావళి పర్వత శ్రేణులు, మాల్వా పీఠభూములలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో పెద్ద సంఖ్యలో టేకు చెట్లు ఉన్న ఒక్కగానొక్క దట్టమైన ఆకురాల్చే అడవులు ఉన్నాయి.వెదురు, సలార్, ఉసిరి, బెల్ తో బాటుగా దాదాపు సగం వరకు టేకు చెట్లు ఉన్నాయి. జఖం, కర్మోయి నదులు ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తున్నాయి. స్థానికుల నీటి పారుదల సౌకర్యాలను తీర్చడానికి జఖం నది పై ఒక ఆనకట్ట ను నిర్మించారు. చిరుతపులులు, హైనాలు, నక్కలు, అడవి పిల్లులు, పందికొక్కులు, మచ్చల జింక, ఎలుగుబంట్లు, నాలుగు కొమ్ముల లేళ్ళు వంటి జంతువులను ఈ అభయారణ్యం లో చూడవచ్చు. ఆసక్తికరమైన నిశాచర జీవి ఎగిరే ఉడుతను రాత్రి వేళలలో చెట్ల మధ్య ఎగరడం చూడవచ్చు.సీతాదేవి రాముడు తనను బహిష్కరించిన కాలంలో ఇక్కడి వాల్మికి ఆశ్రమంలో నే బస చేసిందని నమ్మినందువలన ఈ ప్రాంత౦ పౌరాణికి ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది.