మడికెరి కోట వాస్తవానికి ఒక మట్టితో నిర్మించిన కోట. దీనిని 17వ శతాబ్దం చివరి భాగంలో ముద్దురాజా నిర్మించారు. ఈ కోట లోపల ఒక ప్యాలెస్ కూడా కలదు. ఈ కోటను రాతితో మరియు రహస్య మార్గాలతో తర్వాతి కాలంలో టిప్పు సుల్తాన్ నిర్మించాడు.
1790 సంవత్సరంలో రాజు దొడ్డవీర రాజేంద్ర ఈ కోటపై ఆధిపత్యం సాధించాడు. 1812-14 సంవత్సరంలో బ్రిటీష్ వారు, తర్వాత 1834 లో రెండవ లింగరాజేంద్ర ఒడయార్ లు ఈ కోటను మరింత బలపరచారు. ఈ ప్యాలెస్ ఒక తాబేలు ఆకారంలో ఉండి దానిపై రాజు విజయరాజేంద్ర పేరు మొదటి అక్షరాలు కలిగి ఉంటుంది. ఇక్కడే రాజు వీర రాజచే చంపబడిన రెండు పెద్ద రాతి ఏనుగుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ కోట వెనుక ఒక సాహస గాధ వివరిస్తారు. కోట లోపలి భాగంలో వీరభద్ర దేవాలయం ఉంటుంది. దీనిని 1855 సంవత్సరంలో కూలగొట్టి బ్రిటీష్ వారు ఒక చర్చి నిర్మాణం చేశారు.
గోతిక్ శైలి లో కట్టబడిన ఈ సెయింట్ మార్క్స్ చర్చి గ్లాస్ కిటికీలు కలిగి ఉంటుంది. 1933 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పునరుద్ధరించారు. ఒక క్లాక్ టవర్ మరియు ఒక పోర్టికోలు నిర్మించి అప్పటి కమీషన్ కారు కు సౌకర్యం చేశారు. రెండు అంతస్తులు కల ఈ కోట 110 అడుగుల పొడవుకల కట్టడంగా ఉంటుంది. కాలానుగుణంగా ఈ నిర్మాణం నేటికి ఒక మ్యూజియంగా ప్రస్తుత పురావస్తు శాఖ వారిచే నిర్వహించబడుతోంది. కొన్ని చారిత్రక ఆధారాలకు నిలయంగా ఉంది. దీనిలోని ఒక భాగాన్ని గతంలోని మన దేశ సైన్యాద్యక్షుడు ఫీల్డ్ మార్షల్ కలియప్పకు అంకితం చేశారు. కోట పరిసరాలలో ఇంకా చూడవలసినవి జిల్లా జైలు, కోట మహా గణపతి దేవాలయం, మహాత్మ గాంధీ పబ్లిక్ లైబ్రరీలు. కూర్గ్ లోని కోట మహా గణపతి దేవాలయంలో దసరా ఉత్సవాలు వేడుకగా జరుపుతారు.